ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి,మహిళకు తీవ్ర గాయాలు
తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండలంలోని బైపాస్ రోడ్డులో కారు, స్కూల్ బస్సు ఢీకొనడంతో, కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాల అయ్యాయి..శుక్రవారం పుత్తూరు పరిధిలోని పరమేశ్వర మండలం గ్రామానికి చెందిన రమేష్(60), పుష్ప(55), భాను(42), వనజాక్షమ్మ(60), శివమ్మ(55) లు కారులో తమిళనాడులోని పెరంబురులో నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తున్నారు..నారాయణవనం బైపాస్ వద్ద కారు ముందుకు వెళ్లుతున్న మరో వాహనంను ఓవర్ టెక్ చేస్తూ ఎదురుగా శ్రీ వెంకటేశ పెరుమాళ్ కళాశాలకు చెందిన బస్సును ఢీకొంది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమేష్, పుష్ప, భాను, వనజాక్షమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందారు..మరో మహిళ శివమ్మకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.