నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల నిర్వహణల్లో క్రమశిక్షణ పాటించాలని కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. స్థానిక 28/1 జెడ్పీ కాలనీ, 28/2 న్యూ మిలటరీ కాలనీ 1, 28/3 న్యూ మిలటరీ కాలనీ 2 వార్డు సచివాలయాలను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని నోటీసు బోర్డు, హాజరు రిజిస్టర్, వివిధ రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంభందించిన ఆస్థి పన్ను ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ అంశాన్ని పన్ను చెల్లింపుదారులకు అవగాహన పెంచాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కమిషనర్ సూచించారు. సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వేసవికాలపు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరం వెలిగేలా పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ధరించాలని కమిషనర్ ఆదేశించారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.