అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
అమరావతి: అమర్నాథ్ యాత్రకు 2023కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైందని అధికారులు తెలిపారు..జమ్మూ కాశ్మీర్లో 62 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ సంవత్సరం జూలై 1వ తేదిన ప్రారంభమై ఆగస్టు 31వ తేదిన ముగుస్తుందన్నారు..అమర్నాథ్కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం కానుందని పేర్కొన్నారు.. అనంత్నాగ్ జిల్లా పహల్గాం మార్గం, గందేర్బల్ జిల్లా బల్తాల్ మార్గాల్లో ఒకదాన్ని యాత్రికులు ఎంచుకునే ఆవకాశం వుందని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు..13 నుంచి 37 సంవత్సరాల లోపు వయసున్న వాళ్లు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనాలి..యాత్రికులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి..6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు..అమర్నాథ్ ను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు అధికారులు తెలిపారు.