అధికార వైసీపీ,,ప్రతిపక్ష టీడీపీలో నేతలు రాజీనామాలు
సీటు ఖరారు కాకపోవడంతో..
అమరావతి: అధికార వైసీపీ,,ప్రతిపక్ష టీడీపీలో పార్టీ పరంగా టిక్కెట్లు రావని తెలిసిన నేతలు రాజీనామాలు చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..వైసీపీలో నేతల రాజీనామాల పర్వంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు..అలాగే టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీగా రాజీనామా చేశానని తర్వలో వైఎస్ఆర్ సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు..
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ను కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు..దీంతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు..ఏ పార్టీలో చేరబోయేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎంపీ తెలిపారు..
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీగా రాజీనామా చేశానని,, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే, సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు..నేడు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.. తెలుగు దేశం పార్టీలో చాలా అవమానాలు భరించానని,, ఇక భరించలేకనే ఆ పార్టీని వీడుతున్నట్లు కేశినేని నాని తెలిపారు.