AMARAVATHI

అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు ?-వ్లాదిమిర్‌ పుతిన్‌

5వ సారి అధ్యక్షుడిగా పుతిన్..
అమరావతి: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు..(ఈ నెల 15వ తేది నుంచి 17వ తేది వరకు) మూడు రోజులుగా జరుగిన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారంతో ముగిసింది..ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు సమాచారం వస్తొంది..రష్యాలోని 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు తరువాత ఈ విషయం స్పష్టం అయింది..దీంతో ఆయన 5వ సారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు..ఈ విజయంతో మరో 6 సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు..దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా “జోసెఫ్‌ స్టాలిన్‌”ను రికార్డులను అధిగమించనున్నారు..
అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు:- అమెరికాపై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ, అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదని అన్నారు..దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజయం సాధించిన అనంతరం అయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల యావ‌త్ ప్‌వపంచ దేశాలు న‌వ్వుకుంటున్నాయని పేర్కొన్నారు..తాము సైనిక చర్య తీసుకుంటున్న సంయ‌మ‌నంతో ఉక్రెయిన్ పట్ల వ్యవహరిస్తున్నమని,,అయితే అమెరికాలో మాత్రం విపత్తు ఉంద‌ని,, అది ప్ర‌జాస్వామ్య దేశం కాదని ఆరోపించారు.. అమెరికా ప్రభుత్వం త‌న వ‌ద్ద ఉన్న అన్ని అధికారాల‌ను వాడుకుని,,దేశాధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వ్య‌క్తిపై దాడి చేస్తోంద‌ని ఆరోపించారు..డోనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ప్ర‌భుత్వం వేధిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు..అభ్య‌ర్థి రేసులో ట్రంప్ ముందు వ‌రుస‌లో ఉన్నా,, ప్ర‌భుత్వం మాత్రం అయనను కేసులతో నిర్వీర్యం చేస్తోంద‌న్నారు..విదేశీ ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకోదని,, అమెరికా అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా వారితో ర‌ష్యా క‌లిసి ప‌నిచేస్తుంద‌న్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

4 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

7 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

7 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

9 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.