బాయ్కాట్ ఆదిపురుష్,బ్యాన్ ఆదిపురుష్..
హైదరాబాద్: ప్యాన్ ఇండియా మూవీగా సిద్దమౌవుతున్న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ చిత్రం యూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. టీజర్ రిలీజైనప్పటి నుంచి టీజర్ పై, సినిమా చిత్రకరణపై, డైరెక్టర్ పై విమర్శలు,సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు, రామాయణం అని చెప్పి బొమ్మల సినిమా, గ్రాఫిక్స్ సినిమా తీశారేంటి అని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు అందులో రామాయణం ఎక్కడుంది? రావణాసురుడు ఎలా ఉంటాడో తెలీదా, హనుమంతుడు ఎలా ఉంటాడో తెలీదా అంటూ హిందూ సంఘాలు, హిందువులు, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. రామాయణం అని చెప్పి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా చూపిస్తున్నారని, అందులో రామాయణం ఆనవాళ్లు ఒక్కటి కూడా లేవని దర్శకుడు ఓం రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టీజర్ చూసిన వారందరూ ఏకంగా బాయ్కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ అని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో,హీరోయిన్స్,డైరక్టర్స్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. బాయ్కాట్ బాలీవుడ్ అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పై వ్యతిరేకత వస్తున్నవిషయం విదితమే. దీనికి ముఖ్య కారణం బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవుళ్ళని, పురాణాల్ని, హిందూ చరిత్రని వక్రీకరించడమే.బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ హిందూ పురాణాల్ని నాశనం చేస్తున్నారంటూ నార్త్ తో పాటు సౌత్ కూడా విమర్శిస్తోంది. ఆదిపురుష్ టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అసలు రామాయణం పాత్రలకి ఇక్కడ కనపడేవాటికి సంబంధం లేదని. అందుకే ఇప్పుడు బాయ్కాట్ ఆదిపురుష్ , బ్యాన్ ఆదిపురుష్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది.మరి రాబోయే రోజుల్లో ఏం జరుగనున్నదొ వేచి చూడాల్సిందే?
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.