పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం డి.సి.అర్. జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో,, ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో,, ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీలో,, కోవూరు జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సంఘం ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఫెసిటిలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింద అన్నారు. ఇతర జిల్లాల నుండి ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఓటు హక్కును వినియోగించు కోవడానికి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఏర్పాటుచేసిన ఫెసిటి లేషన్ సెంటర్ లో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.ఇతర జిల్లాల నుంచి 2 వేల 548 మంది పోస్టల్ బ్యాలెట్ లను వినియోగించుకోనున్నారన్నారు.ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.