నెల్లూరు: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చేపట్టిన జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 12.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించామని, ఈ మేరకు ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలోని 9 నర్సరీలో అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్తీకమాసంలో దేవత వృక్షాలను నాటడం ఆనవాయితీ అని, ఆ మేరకు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా మొక్కలు నాటడం తమ బాధ్యతగా భావించాలన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.