నెల్లూరు: రహదారి భద్రత అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, మేయర్ శ్రీమతి స్రవంతి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, రోడ్డుపై అవసరమైన చోట ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రాణ నష్టం జరగకుండా 108, 104 సేవలు అందుబాటులో ఉంచిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ, తమను తాము మార్చుకోవాలని, అప్పుడే మార్పు కనిపిస్తుందన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో అధికారులు గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరిలో స్వచ్ఛందంగా మార్పు రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ప్రతినిత్యం వాహనాల్లో ప్రయాణించేవారు నియమాలను పాటిస్తూ ప్రమాదాల నివారణ తమ వంతు బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం వల్ల అనేక ప్రమాదాలు జరిగి, ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని ఆమె సూచించారు. తొలుత రోడ్డు భద్రతా వారోత్సవాల్లో చేపట్టిన కార్యక్రమాలను, జిల్లాలో రోడ్డు ప్రమాదాల వివరాలను, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను ఉప రవాణా కమిషనర్ చందర్ క్లుప్తంగా వివరించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.