గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ ఆవరణంలోని గాంధీజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా జిల్లా చక్రధర్ బాబు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు అనుసరణీయమని, జాతి వున్నత కాలం వారి జ్ఞాపకాలు మనకుంటాయన్నారు. అహింసా సిద్దాంతంతో దేశ స్వాతంత్ర్య పోరాటం నడిపించి స్వాతంత్య్రాన్ని సాధించి ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా నిలిచారని, అలాంటి మహనీయులను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గాంధీజీ తోపాటు ఎంతో మంది స్వాతంత్ర్య సమరంలో తమ జీవితాలను త్యాగం చేశారని, అలాంటి మహనీయులను ప్రతిఒక్కరు గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, డ్వామా పి.డి వెంకట్రావు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి షఫి మాలిక్, కలెక్టరేట్ ఆవరణంలోని వివిద కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.