BUSINESS

మార్కెట్ లో పెరుగుతున్న నకిలీ రూ.500 నోట్లు-ఆర్బీఐ నివేదిక

అమరావతి: మార్కెట్ సర్కూలేట్ అవుతున్న నకిలీ రూ.500 నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది..మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500 నోట్లే ఎక్కువగా వున్నాయని తెలిపింది..గత సంవత్సరం పోలిస్తే నకిలీ రూ.500నోట్ల సంఖ్య 14.4శాతం పెరిగిందని, ఇప్పటివరకు 91,110 నకిలీ నోట్లను గుర్తించినట్టు వెల్లడించింది..(నేడు) మే 30న వార్షిక నివేదిక విడుదల చేసిన RBI 2022-23 సంవత్సరానికి గానూ వివరాలను ప్రకటించింది..గత ఏడాదితో పోలిస్తే రూ.20 నకిలీ నోట్లు 8.4 శాతం పెరిగాయని పేర్కొంది.. రూ.10, 100, 2వేల డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు 11.6 శాతం తగ్గాయని వెల్లడించింది..కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గినట్టు RBI ప్రకటించింది.. 2021-22 సంవత్సరంలో కరెన్సీ నోట్లు ముద్రించడానికి రూ.4, 984.80 కోట్లు ఖర్చు కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4, 682.80 కోట్లు ఖర్చయిందని పేర్కొంది..మార్కెట్లో రూ.500 నకిలీ నోట్ల సంఖ్య భారీగా పెరిగిందని,,ఒరిజినల్ రూ.500 నోట్లను గుర్తించేందుకు RBI కొన్ని గుర్తులను సూచించింది..
కరెన్సీ నోటు ముందు వైపు ఎడమవైపు అడ్డంగా 500 నెంబర్ కనిపిస్తుంది…రెండో గుర్తు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది…కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది…మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్ లో ఇండియా అనే పదాలు కనిపిస్తాయి…మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 500 అని కనిపిస్తాయి…సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం,,సంతకం కింద ఆర్బీఐ ఎంబ్లమ్ ఉంటుంది…రూ.500 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది…ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది…ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి…ఒకే నెంబర్ తో రెండు నోట్లు ఉండవు…రూ.500 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది… అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి…ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి… తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి…లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది… ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

6 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

7 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

9 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

9 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

10 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.