DISTRICTS

చికెన్ పకోడా దుకాణాలపై హెల్త్ ఆఫీసర్ దాడులు

నెల్లూరు: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ  కమిషనర్ హరిత ఆదేశాలతో నగరంలోని వివిధ చికెన్ పకోడా షాపులపై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి దుకాణదారులకు శుక్రవారం జరిమానాలు విధించారు. స్థానిక పాత జడ్పీ ఆఫీస్,సుబేదారు పేట రోడ్డులోని చికెన్ పకోడా దుకాణాల్లో నిబంధనలు పాటించకుండా, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దుకాణదారుల వద్ద నుంచి దాదాపు 30 కేజీల వరకు చికెన్ పకోడాను అధికారులు స్వాధీనం చేసుకొని, పదివేల రూపాయల జరిమానాన్ని విధించారు.ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని పలు దుకాణాలపై దాడులు చేసి, సంబంధిత చికెన్ పకోడాను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాటిని నిర్వీర్యం చేసి, మొదటి హెచ్చరిక కింద జరిమానాన్ని విధించడం జరిగిందని తెలిపారు.మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం అయితే షాపులను సీజ్ చేయడమే కాకుండా యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.అదేవిధంగా కచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్లను కలిగి ఉండాలని 100% పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెంకటేశ్వరరావు, నీరజ, ప్రశాంతి ఫ్లోరా, శానిటరీ సూపర్వైజర్ కృష్ణారెడ్డి, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

18 mins ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

6 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

7 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

7 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

23 hours ago

This website uses cookies.