NATIONAL

చట్టవిరుద్ధ లోన్ యాప్​ల లావాదేవీలపై CBI,EDలు దృష్టి సారించాలి-కేంద్ర ఆర్థిక శాఖ

అమరావతి: అప్పు అడిగిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా,,డాక్యూమేంటేషన్ ఆసలే అవసరం లేదంటూ,, సులువుగా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధిస్తున్న లోన్​ యాప్​ లను కట్టిడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టుంది..లోన్​ యాప్​ల ఆగడాలు అంతకంతకూ ఎక్కువై, అనేక మంది రుణగ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమ లోన్​ యాప్స్​ అసలు ప్లే స్టోర్స్​లో కనిపించకుండా చేయాలని,, ఇందుకోసం చట్టబద్ధమైన లోన్​ యాప్​ల వివరాలతో వైట్​ లిస్ట్ తయారు చేయాలని రిజర్వు బ్యాంకును ఆర్థిక శాఖ ఆదేశించింది..శుక్రవారం దిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం లోన్​ యాప్​ల పనితీరు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు..రిజర్వు బ్యాంకు తయారు చేసిన వైట్​ లిస్ట్​లోని లోన్​ యాప్​లు మాత్రమే ఆండ్రాయిడ్, యాపిల్ యాప్​ స్టోర్స్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు..అక్రమ లోన్​ యాప్​ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు..చట్టవిరుద్ధ రుణ యాప్​ల లావాదేవీలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ దృష్టి సారించేలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది..

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

18 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

19 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

20 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

21 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

23 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.