హైదరాబాద్: మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని… హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది వచ్చేలా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ప్రజలను కోరారు..శుక్రవారం 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భువనగిరి నియోజకవర్గం, పెద్దరావులపల్లి మూసీ బాధిత గ్రామ ప్రజలతో రచ్చ బండ నిర్వహించిన సందర్బంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఈసారి మీ వద్దకొస్తే చెట్టుకు కట్టేసి మూసీ నీళ్లతో స్నానం చేయించండి.. ఫినాయల్ పోసి కడగండి…అప్పుడైనా బుద్ది వచ్చి మూసీ ప్రక్షాళన చేస్తాడేమో‘‘అన్నారు..స్థానిక ప్రజలు మూసీ నీటితో పడుతున్న కష్టాలను ఏకరవు పెడుతూ మూసీ నీళ్ల వల్ల తినే తిండి కూడా కలుషితమైపోయిందని వాపోయారు..తమ ప్రాంతాల్లో పెళ్లి చేసుకుందామంటే పిల్లను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నీళ్లతో పంటలన్నీ నాశనమవుతున్నాయని… అరోగ్యం దెబ్బతిని చావు బతుకుల మధ్య బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు, ఇందుకు సంజయ్ పై విధంగా స్పందించారు..అలాగే ఎన్నికల కోసమో,,ఓట్ల కోసమో మేము ఇక్కడికి రాలేదు..ప్రజల సమస్యలు తెలుసుకోమని మోదీ పంపితేనే ఇక్కడికి వచ్చాం.. పైసలు ఇస్తే ఓట్లు వేస్తారని కేసీఆర్ భ్రమలో ఉన్నారు. ప్రజలు మూసీ కాలుష్యం వలన పంటలు, పొలాలు, ఆరోగ్యాలు ఇలా… అన్ని రకాలుగా నష్టపోతున్నారు.మూసీ ని గోదావరి, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళలా చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?. 2002 లో అద్వానీ గారు మూసీ ప్రక్షాళన కోసం రూ.344 కోట్లు కేటాయించారు..కేసీఆర్ వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.4000 కోట్లు కేటాయిస్తాం అని అన్నారు. ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. సబర్మతి నదిని చూసి వచ్చి, మూసీ ని అలా సుందరీకరిస్తాం అన్న కేసీఆర్… ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ కు 300 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. తన ఫార్మ్ హౌస్ కు నీళ్ల కోసం 200km దూరం ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు రప్పించుకున్నాడు. అందుకు లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశాడు. కేసీఆర్ ఏమో అమీర్ అవుతూ.. మిమ్మల్ని బికారోళ్ళను చేస్తున్నాడంటూ మండిపడ్డారు..మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,,మూసీ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.