AMARAVATHI

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని,,ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామని పవన్ కల్యాణ్ అన్నారు..ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని,,గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకమే ఉందన్నారు..వైసీపీ, 10 రూపాయిలు ఇచ్చి 100 రూపాయిలు కొట్టేసిందని మండిపడ్డారు..ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల మేర అప్పు ఉందని,,అన్ని వర్గాలను నాశనం చేశారని,,విధ్వంస పాలన సాగనంపి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు..

మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నామన్నారు..20 లక్షల మంది యువతకు ఉపాధి,,నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి,,మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం,,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,,తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ.15 వేలు,,స్కిల్ గణన చేపడతాం,,ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు,,10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం,,సమగ్ర ఇసుక విధానం తెస్తాం,,ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు,,కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతామన్నారు..కూటమి అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతామని చంద్రబాబు తెలిపారు.

వృద్దాప్య పించన్లు రూ.4 వేలు ఇస్తామని,,అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు..అలాగే వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది..బీసీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామని,,బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లతో పాటు బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు..బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు,,ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని తెలిపారు..పవర్ లూం, హ్యాండ్ లూములకు కొంత మేర ఉచిత విద్యుత్,,మత్స్యకారులను ఆదుకుంటామని వెల్లడించారు..డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు..సంపద సృష్టించి,,ఆదాయాన్ని పంచుతామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

13 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

14 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

15 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

16 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.