NATIONAL

విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలి-ప్రధాని మోదీ

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సు..

అమరావతి: విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలని,,ప్రయోగశాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..మంగళవారం మహారాష్ట్రలోని రాష్ట్రసంత్‌ తుకాదోజీ మహారాజ్‌ నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సును వర్చువల్ ప్రారంభించారు..అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తుచేశారు..అంతర్జాతీయ మిల్లెట్స్ (తృణ ధాన్యాల) సంవత్సరంగా ప్రకటించిందని, భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్పిని సైన్స్ వినియోగంతో మరింత మెరుగుపరచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు..సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగడం,, సైన్స్ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు..21వ శతాబ్దంలో భారతదేశంలో మనకు రెండు విషయాలు కనిపించాయని,,డేటా, టెక్నాలజీ అని వివరించారు..ఇవి భారతదేశ విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవన్నారు..డేటా విశ్లేషణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు..సైన్స్ రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ నిలవడం గర్వకారణమని తెలిపారు..ప్రస్తుతం స్టార్టప్‌లలో భారతదేశం ప్రపంచంలోని మొదటి 3 దేశాలలో ఒకటిగా ఉందని ప్రధాని మోడీ వివరించారు..2015 వరకు 130 దేశాల గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ లో 81వ స్థానంలో ఉన్నామని,,అయితే 2022 నాటికి 40వ స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

20 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

21 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

23 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

23 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

1 day ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.