నెల్లూరు: నగరంలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో నిర్మించిన కాపు భవన్ ను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఈనెల 16న కాపు భవన్ ను ప్రారంభించనుండగా, ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే భవనం లోపల ఏసీలు, జనరేటర్ ఏర్పాటు చేయాలని, భవన ప్రాంగణంలో చదును చేసి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కాపు సంఘ నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు. కాపు భవన్ కు కేటాయించిన మిగిలిన స్థలం ఆక్రమణకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సంపత్ కుమార్, ఈఈ గిరిధర్, ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, 41 వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, బలిజ సంఘ నాయకులు ఉన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.