AMARAVATHI

పక్కాగా అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయండి-కమిషనర్ వికాస్

ఏమో! ఎన్నికలు ఎప్పుడైన రావచ్చు??

(తెలంగాణతో పాటు రాష్ట్రంలోను ముందస్తూ ఎన్నికలు జరిగేందుకు ఆవకాశలు వున్నయంటూ జాతీయ మీడియాతో పాటు రాష్ట్రంలోని మీడియా నిన్నటి నుంచి హడవిడి చేస్తోంది..దిని వెనుక వున్న నేపద్యం…బుధవారం సీ.ఎం జగన్,,ప్రధానమంత్రి,,హోం మంత్రులను కలవడమే…రాష్ట్రానికి రావల్సిన నిధులు,,పలు పథకాల కోసంమే ప్రధాన మంత్రిని కలవడం జరిగిందని,,ముందస్తూ ఎన్నికలకు వెళ్లె ఆలోచన లేదంటూ వైసీపీ ఎం.పీ మిథున్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు..అయితే ఉహాగానలకు మాత్రం పుల్ స్టాప్ పడలేదు..జిల్లా అధికార యంత్రగం,,ఓటర్ల నమోదు కార్యక్రమం పక్కాగా చేయాలంటూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు..దింతో ప్రజల్లో ముందస్తూ ఎన్నికలంటూ వస్తున్న వార్తలపై గందరగోళం నెలకొంది.)

నెల్లూరు: ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటు హక్కు లేని అర్హులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూపర్వైజర్ లను కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. ఎన్నికల అధికారులు,  సూపర్ వైజర్లతో నగరపాలకసంస్థ కార్యాలయంలోని ఏ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా రూపొందించడంలో కేంద్ర ఎన్నికల  సంఘం నిర్దేశించిన విధి విధానాలను అనుసరిస్తూ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు, యాక్షన్ ప్లాన్ రూపొందించెలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ అందించి క్షేత్ర స్థాయిలో వారి సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్లు – జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, కొత్త ఓటర్ల నమోదు, వివిధ క్లయిముల పరిష్కారం, గత ఓటర్ల జాబితాతో నేటి జాబితా పోలిక, యువ ఓటర్ల తగ్గుదలను భర్తీ చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ఏ.ఈ.ఆర్.ఓ లు దృష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్లు – జనాభా నిష్పత్తిలో  ఉన్న తేడాను తగ్గించేందుకు, ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వ తేదీ వరకు గడప గడపకు తిరిగి తద్వారా ఓటర్ల గుర్తించి నమోదుకు ప్రజలను చైతన్యపరిచి, 18 సంవత్సరాలు దాటిన అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న 6, 7, 8  క్లైయిమ్ ఫారాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, బూత్ స్థాయి అధికారులను   క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓ లు నిర్మాలనంద బాబా, శ్రీనివాసులు, దేవీ కుమారి, మాధవి,దశయ్య, చక్రపాణి ,సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

3 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

5 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

5 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

10 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.