అమరావతి: భారత జూడో ప్లేయర్ లింతోయ్ చనంబం 16 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచం జూడో చాంపియన్గా అవతరించి చరిత్ర సృష్టించింది. సారాజెవోలో జరిగిన క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 57 కిలోల విభాగంలో బ్రెజిల్కు చెందిన బియాంకా రీస్ను 1-0తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది..దీంతో తొలిసారిగా స్వర్ణం సాధించిన ఏకైక భారత జూడో ప్లేయర్గా లింతోయ్ చనంబం చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారత జూడో క్రీడాకారిణి లింతోయ్ కు SAI (స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) అభినందనలు తెలిపింది.. ఆసియా ఛాంపియన్ అయిన లింతోయ్..57 కిలోల విభాగంలో బ్రెజిల్కు చెందిన బియాంకా రీస్ను 1-0 తేడాతో ఓడించి క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో గెలుపొందింది ” అని SAI మీడియా ట్వీట్ చేసింది. లింతోయ్ చనంబం 2018లో సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణం,,ఆటు తరువాత నవంబర్ 2021లో చండీగఢ్లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్లోనూ స్వర్ణం గెలుచుకోగా,,జూలై 2022లో జరిగిన ఆసియా క్యాడెట్, జూనియర్ జూడో ఛాంపియన్షిప్లలో మరో పసిడి పతకం దక్కించుకుంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.