అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేహాత్ ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా గ్రామంలో ఓ ఇంటిలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు..మరణించిన వారిలో సతీష్(29) కాజల్(25) వారి ముగ్గురు చిన్నారులు ఉన్నారు..మార్చి 12వ తేదీ తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది..గుడిసెలో ఆకస్మికంగా మొదలైన మంటలు,,కాసేపటికే భారీ అగ్ని ప్రమాదానికి దారి తీశాయి. దీంతో గుడిసె అంతా మంటల్లో చిక్కుకుపోయింది..ఇంటి బయట నిద్రస్తున్న సతీష్ తల్లి తీవ్రంగా గాయపడింది..పరిస్థితి గమనించి స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది..అప్పటికే ఆ ఇంట్లో నిద్రపోతున్న ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయి మృతి చెందారని కాన్పూర్ ఎస్పీ మీడియా తెలిపారు..సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికి ఫలితం లేకపోయింది..పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని,,కేసు నమోదు చేసి,అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.