AMARAVATHI

చర్చిల నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి భారీ నిరసన-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని,, కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని వైసీపీ రెబల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కమ్యూనిటీ హాల్ కోసం అలసత్వం ప్రదర్శించారని అరోపించారు.. నాకు కొత్తగా సమస్యలు గుర్తొచ్చాయి అని అధికార పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు..నాకు కొత్తగా సమస్యలు గుర్తు రాలేదని,,ఇప్పటి వరకు సీ.ఎం 3 సార్లు సంతకాలు పెట్టారని సంబంధిత G.O కాపీలను చూపించారు..కలెక్టర్ తో మాట్లాడి 150 అంకణాల స్థలాన్ని ఏర్పాటు చేసి శిలాఫలకం వేయడం జరిగిందన్నారు..కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగక పోవడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని కోరారు..

అధికారపార్టీ ఎమ్మేల్యేగా వున్నప్పుడు సాధించలేని కమ్యూనిటీ హాల్ నిర్మాణం,,రెబల్ ఎమ్మేల్యేగా సాధిస్తారని అనుకుంటున్నారా అంటూ విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధికారులు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగడం జరిగింది,,అధికార పార్టీ నుంచి బయటకి వచ్చాక సమస్యలని వదిలేయాలని అనుకోలేవడం లేదని,,పోరాటం చేస్తునే వుంటానని అన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ నెల 8న ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంకి వాట్స్ యాప్, టెక్స్ట్ మెసేజెస్, పోస్ట్ కార్డ్ ద్వారా మెసేజెస్ పెడుతాం..తరువాత పదిరోజుల పాటు సిటీ, రూరల్ లో అన్ని చర్చిల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి మెసేజెస్ పంపిస్తామన్నారు..అయినా స్పందించకుంటే 18వ తేదీ తరువాత ఒక రోజు గాంధీనగర్ లోని కమ్యూనిటీ హాల్ స్థలం వద్దకి నగర, రూరల్ నియోజకవర్గాలలోని చర్చిల నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి భారీ నిరసనకు శ్రీకారం చేస్తామని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

15 mins ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

29 mins ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

19 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

This website uses cookies.