నెల్లూరు: నగర పాలక సంస్థ సిటీ నియోజకవర్గ పరిధిలోని 248 పోలింగ్ కేంద్రాలతో పాటు ఆర్.టి.సి బస్టాండ్, M.G.షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్ లు వంటి వివిధ ప్రత్యేక కేంద్రాలలో ఈ నెల 8-11-2023 నుంచి 8-12-2023 వరకు నెల రోజులు పాటు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు.గురువారం ఓటరు ప్రత్యేక నమోదు కేంద్రాలను ఎన్నికల సిబ్బంది సమర్ధంగా నిర్వహించి, ప్రతి ఒక్క ఓటరూ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి కమిషనర్ సూచించారు.
ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రచురించిన తుది ఓటర్ డ్రాఫ్ట్ రోల్ ముసాయిదా జాబితాలో నూతనంగా సవరణలు, అభ్యంతరాలు, ఫారం 6,7,8 దరఖాస్తులను బి.ఎల్.ఓ. లు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని కోరారు. ఓటరు ప్రత్యేక కేంద్రాలలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్లంతా జాబితాలో ఓట్లను సరిచూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారం 6,7,8 దరఖాస్తులను ఓటర్లు అందజేయాలని కమిషనర్ కోరారు. ఓటరు జాబితాలో సవరణలు, అభ్యంతరాలు, మార్పు చేర్పులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలను అర్హులైన ఓటర్లు వినియోగించుకుని పరిపూర్ణమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.