AMARAVATHI

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించండి- కమిషనర్ వికాస్

నెల్లూరు: పరిపూర్ణమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల జాబితా రూపొందించడంలో బూత్ లెవెల్ అధికారులకు సహకరించాలని కమిషనర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కార్పొరేషన్ లోని కమిషనర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై కమిషనర్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత నెల 21 నుండి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ తిరిగి ప్రస్తుతం వున్న ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు వారికి సంపూర్ణంగా సహకరించినట్లయితే ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించగలమన్నారు.

రాజకీయ పార్టీలన్నీ ప్రతి పోలింగ్ స్టేషన్ కు  బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించాలని కోరారు. బి.ఎల్.వో లు ఈ నెల 21 వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి ముందస్తు ఓటర్ల జాబితా పనులను పూర్తి చేయనున్నారని వివరించారు. అర్హులైనప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు, ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18  సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కావలసినవారు, నివాసం మారినవారు, ఇటీవల మరణించిన వారి సమాచారాన్ని సేకరించి, ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేస్తున్నామని కమిషనర్ ప్రకటించారు. ఒకే ఇంట్లో పదిమందికి పైగా ఓటర్లు, వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు ఉంటే కనుక అలాంటి వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లు మార్పు చేయవలసి ఉన్న, ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా సమస్యలు ఉన్న ఏ.ఈ.ఆర్.ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు. ఒకే ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఓట్లు వేరు వేరు పోలింగ్ బూత్ లో కాకుండా, ఒకే పోలింగ్ బూత్ లో ఉండే విధంగా జాబితాలో మార్పు చేర్పులు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు CONG-మల్లికార్జున, TDP-భువనేశ్వర్ ప్రసాద్, BSP-శ్రీరామ్,CPI – షాన్ వాజ్, షిరాజ్, తహశీల్దార్ నిర్మాలనంద బాబా, DCP దేవీ కుమారి,EDT మాధవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

30 mins ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

3 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

3 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

8 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.