అమరావతి: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై నిపుణుల బృందం రైల్వేశాఖకు ప్రాథమిక నివేదిక అందచేసింది..సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం కారణమని సౌత్ ఈస్ట్ సర్కిల్ కమిషనర్ ఏ ఎం చౌదరి నేతృత్వంలోని నిపుణుల బృందం రైల్వే శాఖకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది..సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని,,లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీ కొట్టింది అని రైల్వేశాఖకు తెలియజేసింది..మెయిన్ లైన్ పై వెళ్లేందుకు కోరమండల్ కు సిగ్నల్ ఇచ్చారని అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్ లైన్ లోకి వెళ్లిందని నివేదికలో వెల్లడించింది.. రైళ్లలో భద్రతా వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత కవచ్ (kavach) ప్రమాదం జరిగిన మార్గంలో అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు..ఈ వ్యవస్థ అందుబాటులో వుండి ఉంటే ప్రమాదం ని లేదా నష్టం తప్పి వుండేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
ప్రాథమిక నివేదిక:-మెయిన్ లైన్ పైనే కోరమాండల్ కు సిగ్నల్ ఉంది…లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ ను కోరమాండల్ ఢీకొన్నది…రైలు ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణం…కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు 6:55 గంటల సమయంలో ప్రమాదం జరిగింది…రైల్లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి…మొదట సిగ్నల్ ఇచ్చినా.. ఆ తరువాత దాన్ని ఆపేశారు…దిని కారణంగా కోరమాండల్ రాంగ్ ట్రాక్ పైకి వెళ్లాల్సి వచ్చింది…మెయిన్ లైన్ బదులు లూప్ లైన్ లోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వెళ్లింది…గార్డ్ బ్రేక్ వ్యాన్,,హాల్ కోచ్ లు మెయిన్ లైన్ పై ఉన్నాయని నిపుణుల బృందం ప్రాథమిక నివేదికలో తేల్చింది.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1257 మంది కాగా,,యశ్వంత్ పూర్ ఎక్స్ ్రెస్ లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1039 మంది..ఒడిశారైలు ప్రమాదంలో వెయ్యి మందికి పైగా ప్రయాణికులకు గాయాలు కాగా మృతుల సంఖ్య 300కు పెరిగే అవకాశం వుంది..భువనేశ్వర్,,కటక్ ఆస్పత్రుల్లో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు..చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళ ప్రయాణికులు వున్నారు.. రెండు రైళ్లలో తెలుగువాళ్లు 200 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..
విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 ఏర్పాటు…కంట్రోల్ రూమ్ నెంబర్స్ 1070, 112, 1800 4250101, గల్లంతైనవారి ఆచూకీ కోసం 8333 9050 22 నెంబర్ …ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేస్తే,,పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని వివరాలు తెలియజేస్తామని ఏపీ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.