AMARAVATHI

చట్టసభల్లో “మహిళా రిజర్వేషన్ బిల్లుకు” రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం

అమరావతి: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో లోకసభ,,రాజ్యసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక ‘మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు..దీంతో ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంది…చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు..చర్చ అనంతరం లోక్ సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా పెద్దలసభ సైతం బిల్లుకు ఆమోద తెలిపింది..ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో మహిళల మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది..చట్టం తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనట్లే.. జనగణన, డీలిమిటెషన్ తరువాత చట్టాన్ని అమల్లోకి తెస్తామని బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్ సభకు తెలిపారు.. 2024 ఎన్నికలు పూర్తికాగానే జనగణన ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు.. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకూ అమల్లో ఉండనుంది.

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 hour ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

16 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

16 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

23 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.