G 20 సమ్మిట్..
అమరావతి: ఇండోనేషియాలో రెండవ రోజు G 20 సమ్మిట్ కొనసాగుతోంది. మాంగ్రోవ్ ఫారెస్ట్ లో వివిధ దేశాల అగ్రనేతలు సమావేశం కాగా ఈ గ్రూప్ లో (మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్) భారత్ చేరింది. ఈ సందర్బంను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, మాంగ్రోవ్ ఫారెస్ట్ ను సందర్శించి,ఇతర దేశాధినేతలతో కలసి మొక్కలు నాటారు. మంగళవారం ఎన్వీరాన్ మెంటల్,, హెల్త్ అంశాలపై చర్చించనున్నారు. ఇండోనేషియా ప్రధాని విడోడో, స్పెయిన్ ప్రధాని పెడ్రో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. సోమవారం జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలతో ప్రధానిమోడీ సమావేశమై,, దౌత్య సంబంధాలు, అభివృద్ధి సహా వివిధ అంశాలపై చర్చించారు. గాల్వాన్ ఘటన తరువాత మొదటి సారి G 20 సమ్మిట్ లో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యారు.తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధానిమోడీ భేటీ అయ్యారు. రెండు దేశాల వ్యూహత్మక సంబంధాలపై ఇద్దరు సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతోపాటు రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భేటీలో చర్చించారు. G 20 సదస్సులో బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, ప్రధానిమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని,భారత్ ప్రతిభకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం అందరు కలిసి కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.నేడు G 20 ముగింపు సభలో ఇండోనేషియా G 20 అధ్యక్ష బాధ్యతలు భారత్ కు అప్పగిస్తుంది.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.