నెల్లూరు: రాష్ట్రంలో జులై 5వ తేదీ పాఠశాలలు ప్రారంభించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పాఠశాలకు అందించకపోవడాన్ని ప్రభుత్వం వైఫల్యంగా ఏబీవీపీ భావిస్తుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలిశెట్టి రాజశేఖర్ చెప్పారు..బుధవారం నగరంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు దందా అరికట్టాలని,,కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల వివరాలను తెలిపే విధంగా నోటీసు బోర్డ్ ఏర్పాటు చేసేలా DEO,MEO లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాల విలీనం చేసే జీవో నెంబర్ 117 ను ఏబీవీపీ ఖండిస్తోందని,,సదరు జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. హై స్కూల్ కేంద్రంగా ఒక కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూలోని 3,4,5 తరగతులు హైస్కూల్లో కలపడాన్ని ఏబీవీపీ ఖండిస్తుందన్నారు..1 తరగతి నుండి 8వ తరగతి వరకు తెలుగు మాధ్యంలోనే బోధన ఉండాలని,,ఏ మీడియాలో చదువుకోవాలి అనే అవకాశం విద్యార్థులకు వదిలేయాలి అని కోరారు..ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి,సహాయ కార్యదర్శి చందు, శ్రీను ,సాయి ,మూర్తి ,అరుణాచలం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.