హైదరాబాద్: బీజేపీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసుకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇస్తూ, బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తాను ఎక్కడ పార్టీ నిబంధనలను అతిక్రమించలేదని, ఏ మతాన్ని కించపర్చలేదని లేఖలో పేర్కొన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను విడుదల చేసిన వీడియోపై, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రక్కదారి పట్టించి తప్పుడు కేసు పెట్టాయని,సదరు కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. మునావర్ ఫారుఖీని అనుకరిస్తూ తాను ప్రసంగించానని, ఏ మతాన్నిలేదా వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని, తనపై 100కు పైగా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 500 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని వెల్లడించారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నాట్లు సమాచారం?
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.