AMARAVATHI

NIA డైరెక్టర్​ జనరల్​గా సందానంద్​ వసంత్ దాతె-ముంబయి 26/11 హీరో

అమరావతి: దేశంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పెరుగుతున్ననేపధ్యంలో,,ఉగ్రవాదులను ఎక్కడిక్కడ అరెస్టులు చేసి కటకటాల వెనక్కు నెట్టడంలో చురుగ్గ వ్యవహారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కొత్త సారథిగా సదానంద్ వసంత్ దాతె నియమితులైయ్యారు..ఇప్పటి వరకు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ATF)కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సదానంద్ వసంత్ దాతెను NIA డైరెక్టర్​ జనరల్​గా నియమిస్తూ గురువారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది..ప్రస్తుతం NIA డైరెక్టర్​ జనరల్​గా ఉన్న దినకర్ గుప్తా మార్చి 31వ తేదిన పదవీ విరమణ చేయనున్నారు..ఆయన స్థానంలో నియమితులైన వసంత్​ దాతె 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగునున్నారు..

1990 బ్యాచ్​ ఉత్తర్​ప్రదేశ్​ IPS​ క్యాడర్​కు చెందిన వసంత్ దాతె, ముంబయి 26/11 ఉగ్రదాడి ప్రధాన నిందితులు అజ్మల్‌ కసబ్‌, అబు ఇస్మాయిల్‌లను బందించడంలో కీలకంగా వ్యవహరించారు..ఉగ్రదాడుల సయమంలో ఆయన ముంబయి అదనపు పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు..ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకొని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసోపేతంగా పోరాడారు.. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ ధాటికి కాళ్లూచేతులకు తీవ్రగాయాలై,,రక్తం కోల్పోయి తాను స్పృహతప్పి పడిపోయేంతవరకు దాదాపు గంటసేపు ఆయన వీరిద్దరినీ అక్కడి నుంచి కదలనీయ్యాలేదు..అదే సమయంలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపేపేందుకు అవకాశం లేకుండా చేయడంతో,, ఎంతోమంది పౌరుల ప్రాణాల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు.. ఆనాటి సాహసోపేత చర్యకు గానూ రాష్ట్రపతి నుంచి పోలీసు పతకాన్ని  వసంత్ దాతె అందుకున్నారు..ఉగ్రదాడుల కేసుల దర్యాప్తుల్లో నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. వసంత్‌ దాతెకు అధునాతన ఆయుధాలను అలవోకగా ఉపయోగించే సామర్థ్యం ఉంది.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

54 mins ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

2 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

3 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

5 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

23 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

23 hours ago

This website uses cookies.