నెల్లూరు: నగర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద అధికారులను ఆదేశించారు.కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో గురువారం సమీక్షించారు.ఈ సందర్భంగా అమో మాట్లాడుతూ వెంకటేశ్వరపురం, అల్లీపురం, కొండ్లపూడి, అక్కచెరువు పాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయి, సిద్ధంగా ఉన్న గృహాలను లబ్ధిదారులకు అందించాలని సూచించారు. గృహాలకు సంభందించిన తాళాలు అందించి, కరెంటు కనెక్షన్లు స్వయంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్పొరేషన్ నుంచి ప్రత్యేక బృందాలను ఆయా గృహ సముదాయాల వద్ద నియమించి ప్రక్రియ మొత్తం ప్రణాళికాబద్ధంగా జరిగేలా సంబంధిత విభాగాల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో అన్ని ప్రాంగణాలను శుభ్రంచేసి అవసరమైన పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టిడ్కో ఎస్.ఈ జాన్ సైమన్ రావు, ఈ.ఈ ఉమా శంకర శాస్త్రి, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, డి.ఈ చంద్రయ్య, ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకట రమణ, హౌసింగ్ విభాగం సిద్దిక్, సందీప్, మెప్మా పి.డి రవీంద్ర, విద్యుత్ శాఖ డి.ఈ మధుసూధన్ రెడ్డి, డి.ఈ.ఈ భాను నాయక్, ఈ.ఈ సోమశేఖర్ రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.