నెల్లూరు: నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. జగనన్న కాలనీ నిర్మాణ పనుల పురోగతిని వివిధ విభాగాల అధికారులతో కార్యాలయంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో లే అవుట్ల నిర్మాణ పనులు, అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలను కేటాయించాలని కమిషనర్ సూచించారు. భవన నిర్మాణ రంగం కార్మికులను పెద్ద సంఖ్యలో నియమించుకుని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ P.D వెంకట దాస్,E.E,,D.E,,A,Eలు, నగర పాలక సంస్థ S.E సంపత్ కుమార్,E.E సంజయ్,A.Eలు, మెప్మా P.D రవీంద్ర,D.C.Y, నగర పాలక సంస్థ హౌసింగ్ అధికారి సిద్దిఖ్ పాల్గొన్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.