DISTRICTS

జగనన్న కాలనీ పనులు వేగవంతం చేయండి- కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. జగనన్న కాలనీ నిర్మాణ పనుల పురోగతిని వివిధ విభాగాల అధికారులతో కార్యాలయంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో లే అవుట్ల నిర్మాణ పనులు, అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలను కేటాయించాలని కమిషనర్ సూచించారు. భవన నిర్మాణ రంగం కార్మికులను పెద్ద సంఖ్యలో నియమించుకుని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ P.D వెంకట దాస్,E.E,,D.E,,A,Eలు, నగర పాలక సంస్థ S.E సంపత్ కుమార్,E.E సంజయ్,A.Eలు, మెప్మా P.D రవీంద్ర,D.C.Y, నగర పాలక సంస్థ హౌసింగ్ అధికారి సిద్దిఖ్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *