నెల్లూరు: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన డ్రైను కాలువల్లో వ్యర్ధాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టాలని కమిషనర్ వికాస్ మర్మత్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న డ్రైను కాలువలను అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన మురుగుకాలువల్లో పారుదల ఆగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సాంకేతిక యంత్రాల సహాయంతో ముందస్తు జాగ్రత్తలను ప్రణాళికా బద్దంగా చేపట్టాలని, ప్రతీ 15 రోజులకు ఒకసారి పురోగతి నీవేదికలను ఫోటోలు, వీడియోల రూపంలో అందజేయాలని ఆదేశించారు.అదేవిధంగా నగరంలోని బోడిగాడి తోట, దొంతాలి డంపింగ్ యార్డులలో చెత్త పేరుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వర్షాకాలం సమయానికి ఆయా యార్డులను డంపింగ్ ఫ్రీ గా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. డంపింగ్ యార్డులలో రీ సైక్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, సేంద్రీయ ఎరువుల తయారీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ లు సంజయ్, చంద్రయ్య, శేషగిరిరావు, డి.ఈ లు, ఏ.ఈ లు పాల్గొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.