NATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభిషేక్,విజయ్ ల బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బోయినపల్లి.అభిషేక్,, విజయ్ నాయర్ల బెయిల్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదికి వాయిదా వేసింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుని ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చగా, అభిషేక్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జైల్లో బుక్స్ , మందులు,చలికి తట్టుకునేందుకు ఉలెన్ బట్టలు అందచేయాలని జైలు అధికారులను  సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది.మరో ముద్దాయి అయిన విజయ్ నాయర్ ని మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విజయ్ నాయర్ కు సంబంధించిన ల్యాప్ టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని,అందులోని డేటా రికవరీ జరుగుతుందని, ల్యాప్ టాప్ లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయని తెలిపారు.లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ ల్యాప్ టాప్ రిపోర్ట్ చాలా కీలకమని,ఇందులో 100 కోట్ల రూపాయిలు ఎలా చేతులు మారాయో తెలుస్తాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాప్ టాప్ రిపోర్టు శుక్రవారం వస్తాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు తెలిపారు.

శరత్ చంద్రారెడ్డి:- జ్యూడిషియల్ రిమాండ్ లో వున్న శరత్ చంద్రారెడ్డికి బుక్స్, ఇంటి భోజనం ఇవ్వాలని  ఆయన  తరపు న్యాయవాదులు సీబీఐ న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. పుస్తకాలను మాత్రమే ఇచ్చేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.ఇంటి భోజనం కుదరదని స్పష్టం చేసిని న్యాయస్థానం,ఒక వేళ డాక్టర్లు సూచిస్తే మాత్రం అలాంటి భోజనం కూడా జైలు వంటగదిలో తయారుచేసి అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

22 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

23 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

24 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

1 day ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 days ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.