అమరావతి: దేశంలో మధుమేహం బాధితులు పెరిగిపోవడంపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ చేసిన అధ్యయనం యూకేకు చెందిన మెడికల్ జర్నల్ లాన్ సెట్ లో ప్రచురితమైంది..ఈ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల గీతను దాటిపోయింది..2019లో 7 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య నాలుగు సంవత్సరాల వ్యవధిలో 44 శాతం పెరిగింది..ప్రస్తుతం దేశంలో ప్రీడయాబెటిక్స్ (త్వరలో మధుమేహం బారినపడే అవకాశం ఉన్నవాళ్లు) సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది..దేశవ్యాప్తంగా 13.60 కోట్ల మందిలో ప్రీడయాబెటిక్ లక్షణాలు బయటపడ్డాయి..ఈ లెక్కన తీసుకుంటే దేశం మొత్తం జనాభాలో ప్రీడయాబెటిక్స్ సంఖ్య 15.3 శాతంగా ఉన్నది..శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు,,కేంద్రపాలిత,,పట్టణ,, గ్రామీణ ప్రాంతాల్లో నివాసిస్తున్న దాదాపు లక్ష మందిపై 2008 అక్టోబర్ 18 నుంచి 2019 డిసెంబర్ 17 వరకు ఈ అధ్యయనం చేశారు..ఈ అధ్యయనం ప్రకారం 2019 డిసెంబర్ నాటికి దేశంలో మధుమేహుల సంఖ్య 7.20 కోట్లుగా ఉండగా ఆటు తరువాత నాలుగు సంవత్సరాల్లో ఈ సంఖ్య 10.10 కోట్లకు పెరిగింది..అలాగే దేశ జనాభాలో 35.5 శాతం మంది అధిక రక్తపోటుతో,, 81.2 శాతం మంది అసాధారణ కొవ్వులతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టం అయింది..అదేవిధంగా 28.6 శాతం మంది సాధారణ ఊబకాయం,, 39.5 శాతం మంది పొట్ట సంబంధ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.