NATIONAL

భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించాం-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశ ప్రజల అవసరల కోసం సురక్షితమైన,, సమర్థవంతమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించామని,ఈ వ్యవస్థ డిజిటల్ చెల్లింపులు,,పాలన,,ఆర్థిక,,జీవనోపాధి స్వరూపంను సమూలంగా మార్చివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..బెంగళూరులో ప్రారంభమైన G-20 ఆర్థిక మంత్రులు,,సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రసంగించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ వినియోగదారులు, తయారీదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని,,మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించాలని కోరారు..మీ చర్చ ప్రపంచంలోని అత్యంత బలహీనమైన పౌరుల ఆర్దిక అవసరాలపై దృష్టి పెట్టాలని తాను కోరుతున్నాని అన్నారు.. గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్ ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడం ద్వారా మాత్రమే ప్రపంచ నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందని అన్నారు.. కోవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని,,అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇప్పటికీ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు..మా G-20 ఛైర్మన్‌షిప్ సమావేశానికి వచ్చిన గ్లోబల్ G20 గెస్ట్‌ లు UPIని ఉపయోగించడానికి అనుమతించే కొత్త ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించామని,,ఇది భారత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ అని అన్నారు..బెంగళూరులో జరుగుతున్న G-20  ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల తొలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

6 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

9 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

9 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

11 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.