నెల్లూరు: జాతీయ రహదారుల భూ సేకరణ వేగవంతం చేస్తూ రైతులకు పరిహారం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డికి వివరించారు. గత రెండు రోజుల్లో భూ సేకరణ పరిహారం క్రింద రైతులకు ఐదు కోట్లు చెల్లించామని ,రాబోయే పది రోజుల్లో పరిహారం చెల్లింపు పూర్తి చేస్తామని కలెక్టర్ సీ.ఎస్. కు. వివరించారు.ఇటీవల ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ జిల్లా పర్యటనకు వచ్చి సమీక్ష చేశారని కలెక్టర్ తెలిపారు.అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పలు అభివృద్ది అంశాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.నెల్లూరు నుండి జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఎం.కూర్మనాధ్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్లు విద్యాదరి, సంజన సీన్హా జిల్లా అధికారులు పాల్గొన్నారు..వీడియో కాన్ఫరెన్స్ లో సి ఎస్. జవహార్ రెడ్డి రాష్ట్రం లోని అన్ని జిల్లాల కలక్టర్లతో మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో కూలీలు ఎక్కువగా పాల్గొని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయి దిశ చట్టం కమిటీ సమావేశాలు త్వరగా నిర్వహించాలన్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.