హైదరాబాద్: ప్రభుత్వం పేదలకు కేటాయించి,స్థలాల పట్టాలు పంపిణీ చేయగా,సదరు భూమిని రామోజీరావు కబ్జా చేశారని సీపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్ వెస్లీ ఆరోపించారు.బుధవారం సంబంధిత సర్వేనెంబరులో వున్న భూములను పేదలకు చూపించాలంటూ,చలో రామోజీఫీల్మ్ సిటీ కార్యక్రమంలో నిర్వహించారు.ఈ సందర్బలో అయన మాట్లాడుతూ పేదలకు సదరు భూములు చూపించాలని,లేదంటే ఫీల్మ్ సిటీని ముట్టడిస్తమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగాన్ పల్లి రెవెన్యూ గ్రామంలో 2007వ సంవత్సరంలో 18 ఏకరాల్లో 700 మంది పేదలకు, ఒక్కొక్కరికి 60 గజాల వంతున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇళ్ల పట్టాలు అందచేశారన్నారు.పట్టాలు అందుకున్న పేదలకు అప్పటల్లో ఇళ్లు నిర్మించుకోవడంలో ఆశ్రద్ద వహించారు.తరువాత జరిగిన పరిణామాల్లో ఈ భూములు రామోజీ ఫిల్మ్ సిటీకి ఇవ్వాలని సంబంధిత వర్గాలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారని తెలిపారు.వాళ్లు అడిగిందే తడవుగా 2017లో ఇందులో 295 ఏకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం శద్ద చూపించిందని ఆరోపించారు. ప్రస్తుతం 189, 203 సర్వే నంబరుల్లో వున్న భూమికి రామోజీ రావు గేట్లు పెట్టి పేదలను లోపలకు రానివ్వడం లేదన్నారు.పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాయాపోల్, నాగన్ పల్లి, పొల్కంపల్లి గ్రామాల ప్రజలు, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.