అమరావతి: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్,, ప్రజలకు ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తొంది.ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి బుల్లెట్లు దూసుకుని వస్తాయో తెలియని పరిస్థితి అగ్రరాజ్యం తాండవిస్తొంది.ఈనేపధ్యంలో మంగళవారం వర్జీనియాలోని చీసాపీక్లోని శామ్ సర్కిల్ వద్ద ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు కలకలం రేపాయి. వాల్ మార్ట్ లో పని చేస్తున్న స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి వెళ్లి అక్కడున్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు కాల్పులు జరిగాయన్నారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో వాల్మార్ట్ తెరిచే ఉందని యూఎస్ పోలీసులు తెలిపారు. వాల్మార్ట్ స్టోర్ దగ్గరకు భారీ సంఖ్యలో అంబులెన్సులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బుల్లెట్ల వర్షం కురిపించడంతో పబ్లిక్ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పరుగులు పెట్టారు. అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ గన్ కల్చర్కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.