అమరావతి: మణిపూర్లో అల్లర్లు చేలరేగిన అనేక ప్రాంతాల్లో కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి దాదాపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తెలిపారు..“ఉగ్రవాదులు పౌరులపై M-16, AK-47 అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్లను ఉపయోగిస్తున్నారని,,ఉగ్రవాదులు ఇళ్లను తగలబెట్టడానికి చాలా గ్రామాలకు వచ్చారన్నారు..సైన్యం సహా ఇతర భద్రతా దళాల సహాయంతో వారిపై చాలా బలమైన చర్య ప్రారంభించామన్నారు..ఈ చర్యలకు పాల్పపడుతున్న వారిని కుకీ టెర్రరిస్టులనే అంటానని సీ.ఎం స్పష్టం చేశారు..వారు నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుపుతున్నారని మండిపడ్డారు..ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై ఉగ్రమూకలు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి..హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్లో పర్యటించనున్నారు..ప్రశాంతత, శాంతిని కొనసాగించాలని, సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని హోం మంత్రి ఇప్పటికే కుకీలకు విజ్ఞప్తి చేశారు..భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల పర్యటన నిమిత్తం శేనివారం రాష్ట్రానికి వెళ్లారు..షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీలో చేర్చాలన్న మొయిటీల డిమాండ్పై ఇంఫాల్ లోయ సహా చుట్టుపక్కల నివసించే వీరు,,కొండల్లో స్థిరపడిన కుకీ తెగల మధ్య మే 3వ తేదిన ఘర్షణ మొదలైంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.