పన్ను వసూళ్ల లక్ష్యాలను పూర్తి..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలం, వాణిజ్య ప్రకటనల పన్నులతో పాటు ప్రతి ఇంటి నుంచి యూజర్ చార్జిల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిషనర్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ ల ఆవశ్యకతపై వ్యాపార వర్గాలకు అవగాహన పెంచి, నగర వ్యాప్తంగా అన్ని షాపులను లైసెన్సుల పరిధిలోకి తేవాలని శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో (క్లాప్) భాగంగా ప్రతీ ఇంటినుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలని, యూజర్ చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయాల వారీగా పన్నుల లక్ష్యాలను నిర్దేశించి, వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ అడ్మిన్, వి.ఆర్.ఓ, ప్లానింగ్ కార్యదర్శులను సమన్వయం చేసి రీ సర్వే పనులను వేగవంతం చేయాలని, సర్వేలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరచాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయాల వారీగా రీ సర్వే పనులను పూర్తి చేసి, రికార్డులను పదిలపరచాలని కమిషనర్ సూచించారు.
అన్ని డివిజనుల్లో వీధి కుక్కల నియంత్రణకై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, కుక్కలపై ఫిర్యాదులను 9553219996 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.