AMARAVATHI

అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అధికార దుర్వినియోగం పాల్పపడ్డారు-అజీజ్

ఏఏజీ వైసిపి ప్రచార కార్యదర్శిగా చేరాలి..

నెల్లూరు: అడిషనల్ ఏజీగా ఉన్న పొన్నవొలు సుధాకర్ రెడ్డి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ప్రతిపక్ష నేతను దొరికిన దొంగ అని మాట్లాడటం అధికార దుర్వినియోగం అబద్ధాలకు పరాకాష్టగా ఉందని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు..గురువారం అయన ఒక ప్రకటన విడుదల చేశారు.. ప్రజా ఖజానాను లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని,,చంద్రబాబు కాదని చెత్త పన్నుతో సహా అనేక పన్నులు,  కరెంటు బస్సు చార్జీలతో సహా అనేక ధరలను విపరీతంగా పెంచారని పెంచిన లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని నవరత్నాలు నవ మోసాలయ్యాయని ప్రభుత్వ ఖజానాను జగన్ ముఠాలు లూటీ చేయడం వల్లే రాష్ట్రం గతుకుల రోడ్ల మయమైందని ఆరోపించారు.. స్కిల్ కేసులో మొదట 3 వేల కోట్ల అన్నారని తర్వాత మాట మార్చి 370 కోట్ల అన్నారని తిరిగి మాట మార్చి 27 కోట్లు అన్నారని దేనికి రుజువు చూపలేదని హైకోర్టు వ్యాఖ్యానించిని విషయంను అయన గుర్తు చేశారు..తక్కువ ఖర్చుతో 2.15 లక్షల మందికి స్కిల్ ద్వారా ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబుపై కేసు పెట్టారా అని ప్రశ్నించారు. బైజుస్ లో సాఫ్ట్వేర్ కి వేల కోట్లు ఎలా ఖర్చు చేశారని బైజుస్ టెండర్లు, క్యాబినెట్ అప్రూవల్ లేవని, 1200 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. స్కిల్ కు క్యాబినెట్ అప్రూవల్, టెండర్లు ఉన్నాయని చట్ట ప్రకారం జరిగింది అవినీతి ఎలా అవుతుందని జగన్ రెడ్డి తన లూటీ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జ్ 17A వర్తిస్తుందని తీర్పు చెప్పారని FIR క్వాష్ కు పాక్షిక విజయం వచ్చిందని అన్నారు..అధికారుల్ని ప్రతిపక్షాన్ని బెదిరిస్తొంది… అక్రమ కేసులు పెడుతున్నది జగన్ ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిని కాపాడుతున్నది కూడా జగన్ ప్రభుత్వమేనని అన్నారు. 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబుకు జైల్లో సౌకర్యాలు కల్పించింది కోర్టు ఆదేశాలే గాని జగన్ ఉదారత్వం కాదని 43 వేల కోట్ల కుంభకోణంలో ఉన్న జగన్ 16 నెలలు జైల్లో భోగాలు అనుభవించారని చంద్రబాబు మూలాఖత్కు కూడా ఆంక్షలు పెట్టారని అన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.