DISTRICTS

ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరులో పేర్లు నమోదు చేసుకోవాలి-కలెక్టర్

నెల్లూరు:  స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మనాధ్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మలతో కలిసి  స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అంతకుమునుపు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి స్పందన అర్జీల పరిష్కారం, ముఖ హాజరు, కోర్టు కేసుల పరిష్కారం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు జారీ చేశారు.

                జిల్లాలో ముఖ హాజరుకు సంబంధించి ఇంకా చాలా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి పేర్లను నమోదు చేసుకోలేదని,  కొందరు నమోదు చేసుకున్నసరిగా వినియోగించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరులో పేర్లు నమోదు చేయడంతో సహా ప్రతిరోజు నూటికి నూరు శాతం ముఖ హాజరు అయ్యేలాగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో 1644 కోర్టు రిట్ పిటిషన్లు,  307 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రధానంగా జలవనుల శాఖలో 186 పంచాయతీరాజ్ శాఖలో 41 కేసులు అత్యధికంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కోర్టు కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోర్టుదికరణ కేసులకు వెంటనే కౌంటర్ ఆఫిడవిట్లు దాఖలు చేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కావలి రానున్నారని, ఆరోజున చుక్కల భూములు, రీ సర్వే కార్యక్రమం సంబంధించి ప్రత్యేక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో చేపట్టవలసిన పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి మంజూరు కోసం ఈ సోమవారమే ఉన్నతాధికారులకు పంపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

10 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

18 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.