నెల్లూరు: ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీల మధ్యలో జిల్లాకు మరో తుఫాన్ హెచ్చరిక ఉన్నందున ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మనుబోలు మండల పరిధిలోని గురివిందపూడి, కాగితాలపూరు గ్రామ సచివాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవసరమైన మందులను అందించాలన్నారు. జిల్లాకు మరో తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులను, పశువుల యజమానులను అప్రమత్తం చేయాలన్నారు.కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీరాజ్ ఎస్ ఈ అశోక్ కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సుధీర్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.