అమరావతి: చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.మంగళవారం FCRA రద్దు గురించి లోక్ సభలో ప్రస్తావన రావడంతో అమిత్ షా మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005– 2006, 2006 –2007 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు రూ.1.35 కోట్లు అందాయని,,ఇది FCRA నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అందుకే దాని రిజిస్ట్రేషన్ను కేంద్ర హోంశాఖ రద్దు చేసిందన్నారు. చైనా మీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని,దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నయని అమిత్ షా వ్యాఖ్యానించారు. చైనా సరిహద్దు వివాదం పై వ్యాఖ్యనిస్తూ కాంగ్రెస్ పాలన సమయంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారతదేశం వైపు కాని దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని అన్నారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.