హైదరాబాద్: గోషామహాల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓంపాఠక్ స్పష్టం చేశారు..రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మునావర్ షోను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు.తాను వ్యతిరేకించినా.. షో నిర్వహించారని యూట్యూబ్ లో రాజాసింగ్ వీడియో విడుదల చేశాడు.అయితే ఈ వీడియోలోని వ్యాఖ్యలు ముస్లిం వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులతో కేసులు నమోదవుతున్నాయి.ఈ విషయంను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం రాజాసింగ్ పై చర్యలు తీసుకుంటూ, పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఎమ్మెల్యే రాజాసింగ్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో సోమవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు మంగళవారం ఉదయమే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.