AGRICULTURE

రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం

అమరావతి: రైతులపై ఎరువుల భారం పడకుండా 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో ఎరువుల పై రాయితీని కేంద్రమంత్రిమండలి ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించడంతో, రబీ సీజన్ లో దాదాపు రూ.51,875 కోట్ల రూపాయల రాయితీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నత్రజని (N), భాస్వరం (P), పొటాష్ (K), సల్ఫర్ (S) వంటి ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ (NBS) కోసం కేంద్ర ఎరువుల శాఖ ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడంలో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రైతులు లబ్ధి పొందనున్నారు.2022-2023 రబీ సీజన్ కు గానూ అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల వద్ద రాయితీతో కూడిన ఎరువులు లభించనున్నాయి. రష్యా,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా,ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.అయితే ప్రధాని మోదీ,భారత్ కు ఎరువుల సరఫరా పెంచాలని చేసిన విజ్ఞప్తికి, రష్యా అధ్యక్షడు పుతిన్ సానూకూలంగా స్పందించడంతో,భారతదేశంలోని రైతులకు సరిపడినంత ఎరువులను కేంద్రం అందిచనున్నది.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

14 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

15 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.