నెల్లూరు: “వికసిత్ భారత సంకల్ప్ యాత్ర-ఫేస్ 2 ” కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం కోరారు.కేంద్ర ప్రభుత్వ పథకాలపై తేదీ 05-02-24 నుంచి 14 రోజులపాటు నగరంలో 28 ప్రాంతాల్లో ప్రచార వాహనం, శిబిరాల ద్వారా అవగాహనా క్యాంపులను నిర్వహిస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ సూచించారు. క్యాంపులలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, అవగాహన, అర్హులైన వారికి రిజిస్ట్రేషన్, ఆధార్ అప్డేట్, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు తదితర అంశాలను చేపడుతారని కమిషనర్ తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమ వ్యక్తిగత అనుభవాలను క్యాంపుల ద్వారా పంచుకుంటారని వెల్లడించారు.నగర పాలక సంస్థ గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అందరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు,అవగాహన కల్పించాలని కమిషనర్ తెలియచేశారు.అవగాహనా శిబిరాలలో కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.