కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి – కమిషనర్ వికాస్
నెల్లూరు: “వికసిత్ భారత సంకల్ప్ యాత్ర-ఫేస్ 2 ” కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం కోరారు.కేంద్ర ప్రభుత్వ పథకాలపై తేదీ 05-02-24 నుంచి 14 రోజులపాటు నగరంలో 28 ప్రాంతాల్లో ప్రచార వాహనం, శిబిరాల ద్వారా అవగాహనా క్యాంపులను నిర్వహిస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ సూచించారు. క్యాంపులలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, అవగాహన, అర్హులైన వారికి రిజిస్ట్రేషన్, ఆధార్ అప్డేట్, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు తదితర అంశాలను చేపడుతారని కమిషనర్ తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమ వ్యక్తిగత అనుభవాలను క్యాంపుల ద్వారా పంచుకుంటారని వెల్లడించారు.నగర పాలక సంస్థ గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అందరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు,అవగాహన కల్పించాలని కమిషనర్ తెలియచేశారు.అవగాహనా శిబిరాలలో కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.