అమరావతి: దాదాపు రెండు దశాబ్దల క్రిందట నక్సల్స్ మూసివేయించిన ఓ రామాలయాన్ని తిరిగి సోమవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు తెరిచారు..నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని లఖాపాల్, కేరళపెండా గ్రామాల సమీపంలో 1970లో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు..ఈ గుడిలో ఎలాంటి పూజలు చేయకూడదని 2003లో నక్సల్స్ ఈ ఆలయాన్ని మూసివేశారు..వారి బెదిరింపుల కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 21 సంవత్సరాల పాటు ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులను తెరిచేందుకు ధైర్యం చేయలేదు.. నక్సల్స్ (మావోయిస్టులను) ఏరివేత కార్యక్రమంలో బాగంగా CRPF 74వ బెటాలియన్ కోసం లఖాపాల్ క్యాంప్ ను కేరళపెండా గ్రామానికి సమీపంలో 2023లో ఏర్పాటు చేశారు… CRPF బెటాలియన్ ఈ ప్రాంతంలో వుండడంతో నక్సల్స్ ప్రభావం క్రమేపి కనుమరుగు అవుతూ వస్తొంది..దింతో తమ గ్రామంలో ఉన్న పురాతనమైన రామాలయం గురించిన CRPF సిబ్బందికి గ్రామస్థులు తెలిపారు.. CRPF ఉన్నతధికారులు ఆలయాన్ని తిరిగి తెరిపించి ఎప్పటిలాగే పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు..తాళం వేసి ఉన్న మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు..అనంతరం సదరు గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత గుడిని బాధిత గ్రామ పెద్దలకు అప్పగించారు.
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.